Chandrababu Naidu: పొత్తు కుదిరింది.. క్లీన్ స్వీప్!

Chandrababu Naidu: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు… భార‌తీయ జ‌న‌తా పార్టీతో పొత్తు కుదిరింద‌ని ప్ర‌క‌టించేసారు. మీడియా ముందుకు కాకుండా.. ఢిల్లీ నుంచి టెలీ కాన్ఫ‌రెన్స్ ద్వారా పార్టీ కేడ‌ర్‌తో మాట్లాడారు. ఈ సారి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో మూడు పార్టీలు క‌లిసి క్లీన్ స్వీప్ చేస్తాయ‌ని వెల్ల‌డించారు. భార‌తీయ జ‌న‌తా పార్టీకి, జనసేనకు క‌లిపి 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలు ఇస్తున్నామని పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్ర‌బాబు నాయుడు వెల్ల‌డించారు.