పెన్షన్లు ఆపేయ‌నున్న YSRCP?

YSRCP: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త ప్లాన్ వేసిన‌ట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పెన్ష‌న్లు ఆపేయాల‌ని అనుకుంటోంద‌ట‌. ఈ మేర‌కు వాలంటీర్ల‌ను గ‌డ‌ప గ‌డ‌ప‌కు పంపించి పెన్ష‌ను రాదు.. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) రానివ్వ‌కుండా అడ్డుకుంది అని చెప్పించాల‌ని నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఇలా చేస్తే తెలుగు దేశం పార్టీకి ప‌డాల్సిన ఓట్లు త‌మ‌కు ప‌డ‌తాయ‌న్న ఆశ‌తో నేత‌లు ఈ ప్లాన్ వేస్తున్నార‌ట‌. ఈ మేర‌కు వాలంటీర్ల‌కు ముఖ్య గ‌మ‌నిక పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోంద‌ట‌. ఈ మేర‌కు వాలంటీర్ల‌కు వాయిస్ మెసేజ్ పంపుతున్నార‌ట‌. ఈ రోజు ఆదివారం కావ‌డంతో చాలా మంది వాలంటీర్ల‌కు ఈ మెసేజ్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.