Punganuru Violence: TDP కుట్రేనా?

Punganuru: చిత్తూరు జిల్లాలోని పుంగ‌నూరు ప్రాంతంలో (punganuru violence) TDP, YSRCP వ‌ర్గాల మ‌ధ్య దాడులు జ‌రిగాయి. ఒక వ‌ర్గం వారు మ‌రో వ‌ర్గంపై రాళ్లు రువ్వ‌డాలు, పోలీసుల‌ వాహ‌నాల‌ను ధ్వంసం చేయడాలు వంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డారు. అయితే ఈ పుంగనూరు దాడి TDP కుట్రేనని తెలుస్తోంది. దాడి జ‌రుగుతున్న స‌మ‌యంలో TDP కార్య‌క‌ర్త ఒక‌రు వీడియో తీస్తూ జ‌గ‌న్ (ap cm jagan) పుంగ‌నూరు పుడంగా.. మేమేందో చూపిస్తాం. ఈ వీడియో అన్ని సోష‌ల్ మీడియాల్లో పెడ‌తా అంటూ రెచ్చ‌గొట్టే విధంగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

ఈ దాడుల వెనక ఉన్న‌ది చంద్ర‌బాబు నాయుడేన‌ని (chandrababu naidu) కొంద‌రి వాద‌న‌. YSRCP కార్య‌క‌ర్తలు ఎక్క‌డ క‌నిపిస్తే అక్క‌డి నుంచి త‌రిమికొట్టండి అని రెచ్చ‌గొట్టిన‌ట్లు తెలుస్తోంది.మ‌రోప‌క్క ఇది YCP వారి దాడేన‌ని కూడా వాద‌న‌లు వినిపిస్తున్నాయి. TDP నేత‌ల‌పై దాడి చేస్తుంటే స్థానిక పోలీసులు ఆప‌కుండా స‌పోర్ట్ చేసార‌ని అందుకే TDP కార్య‌క‌ర్త‌లు కోపంతో వారి వాహ‌నాల‌ను ధ్వంసం చేసార‌ని అంటున్నారు. #PunganuruViolenceByYCP అని కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.