Narendra Modi ఈ ముఖ్య‌మంత్రికి మాత్ర‌మే భ‌య‌ప‌డుతున్నారా?

Narendra Modi: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకే అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, రాజ‌కీయ నేత‌లు భ‌య‌ప‌డ‌తారు. భ‌యం అంటే ఆయ‌నేదో చేసేస్తార‌ని కాదు. సిగ్గుతో కూడిన భ‌యం వ‌ల్ల వ‌చ్చిన గౌర‌వం అనుకోవ‌చ్చు. అలాంటి మోదీ ఈ దేశంలోని ఒకే ఒక్క ముఖ్య‌మంత్రి అంటే భ‌య‌ప‌డుతున్నార‌ట‌. ఆయ‌నెవ‌రో కాదు దేశ రాజ‌ధాని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ (arvind kejriwal). అందుకే ఆయ‌న్ను సంబంధం లేకుండా ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో ఇరికించాల‌ని చూస్తున్న‌ట్లు విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం.

మోదీని ఎవ‌రైనా ఏ విష‌యంలో అయినా ప్ర‌శ్నించినా ఆయ‌న నిబంధ‌న‌ల‌ను ప‌థ‌కాల‌ను వ్య‌తిరేకించినా వారిపై ఈడీ దాడులు ఐటీ దాడులు జ‌రుగుతాయ‌ని అలా కాకుండా ఆయ‌న చెప్పిన మాట వింటూ BJPలో చేరితే మాత్రం వారు సేఫ్‌గా ఉంటార‌ని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్య‌స‌భా ఎంపీ సందీప్ పాఠ‌క్ అంటున్నారు. AAP నేత‌లు అయిన స‌త్యేంద‌ర్ జైన్, మ‌నీష్ సిసోదియా, సంజ‌య్ సింగ్‌లు మోదీ చెప్పిన‌ట్లు న‌డుచుకోకుండా BJPలో చేర‌నందుకే వారిపై దాడులు చేయించి జైల్లో పెట్టించార‌ని ఇప్పుడు అదే విధంగా కేజ్రీవాల్‌ను బొక్క‌లో వేయాల‌ని చూస్తున్నారని ఆరోపించారు.