Parliament: ఆక‌తాయిల‌కు విజిట‌ర్ పాస్ ఇచ్చింది BJP ఎంపీనే!

Parliament: పార్ల‌మెంట్‌లో లోక్ స‌భ (lok sabha) స‌మావేశాలు జ‌రుగుతుండ‌గా షాకింగ్ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. కొంద‌రు ఆక‌తాయిలు పార్ల‌మెంట్‌లోకి చొర‌బ‌డి నానా ర‌చ్చ చేసారు. అయితే BJP ఎంపీ ప్ర‌తాప్ సింహా.. ఆక‌తాయిల్లో ఒక‌రికి సాగ‌ర్ శ‌ర్మ పేరుతో విజిట‌ర్ పాస్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం అందింది. పార్ల‌మెంట్‌పై ఉగ్ర‌దాడి జ‌రిగి నేటికి 22 ఏళ్లు అవుతోంది. స‌రిగ్గా ఇదే రోజు ఆగంతకులు ఇలా పార్ల‌మెంట్‌లోకి ప్ర‌వేశించి న‌ల్ల చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాలి అంటే రంగులు చ‌ల్లి అల్ల‌ర్ల‌కు పాల్ప‌డ‌టం సంచ‌ల‌నం రేపుతోంది. పార్ల‌మెంట్ లాంటి ప్ర‌దేశంలో భ‌ద్ర‌త ఏ స్థాయిలో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలాంటి ప్ర‌దేశంలో భ‌ద్ర‌తా వైఫ‌ల్యం చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం.