Karnataka: ఊపందుకున్న దళిత ముఖ్యమంత్రి నినాదం

Karnataka: కర్ణాటకలో దళిత ముఖ్యమంత్రి నినాదం ఊపందుకుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య (siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ (dk shivakumar) మధ్య జరుగుతున్న వర్గ పోరు కొత్త మలుపు తీసుకుంది. దళితులకు కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ముఖ్య పదవి ఇవ్వాలని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బీకే హరిప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దళిత కాంగ్రెస్ నేత పరమేశ్వర్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు డీకే శివ కుమార్ ప్రాధాన్యత తగ్గించడానికి సిద్దరామయ్య అనుచరుడు, సహకార శాఖ మంత్రి రాజన్న మరో ముగ్గురు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని డిమాండ్ చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 20 సీట్లు గెలిస్తే డీకే శివ కుమార్ ముఖ్యమంత్రి ప‌ద‌వి డిమాండ్ చేస్తారని ఆయన మద్దతుదారులు అంటున్నారు.