Shashi Tharoor: భార‌త్ పాలెస్తీనా వైపు నిల‌బ‌డాలి

ఇజ్రాయెల్‌పై (israel) దాడి చేస్తున్న పాలెస్తీనాకే (palestine) భార‌త్ సపోర్ట్ చేయాలంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేసారు సీనియ‌ర్ కాంగ్రెస్ నేత శ‌శి థ‌రూర్ (shashi tharoor). పాలెస్తీనాకు చెందిన హ‌మాస్ అనే ఉగ్ర‌వాద సంస్థ ఇజ్రాయెల్‌పై దాడికి పాల్ప‌డిన నేప‌థ్యంలో కాంగ్రెస్ పాలెస్తీనాకు స‌పోర్ట్ చేయ‌డం వివాదాస్ప‌దంగా మారింది. దాంతో బీజేపీ నేత‌లు కాంగ్రెస్ ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తోంద‌ని ఆరోపించారు.

ఈ నేప‌థ్యంలో శ‌శి థ‌రూర్ స్పందిస్తూ.. హ‌మాస్ సంస్థ‌ పాలెస్తీనాకు ప్రాతినిథ్యం వ‌హించ‌ద‌ని పాలెస్తీనా ఎలా ఏర్ప‌డిందో మ‌ర్చిపోకూడ‌ద‌ని స‌మ‌ర్ధించుకున్నారు. జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న‌ప్ప‌టి నుంచి భార‌త్ పాలెస్తీనాకే స‌పోర్ట్ చేస్తూ వచ్చింద‌ని.. మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌ధానిగా ఉన్నంత వ‌ర‌కు ఈ స‌పోర్ట్ కొన‌సాగింద‌ని ఈ సంద‌ర్భంగా శ‌శి థ‌రూర్ గుర్తుచేసారు.