Jaleel Khan: జ‌న‌సేన‌కు టికెట్ ఇస్తే ముస్లింలు ఉరేసుకుంటారు

Jaleel Khan: తెలుగు దేశం (TDP), జ‌న‌సేన (janasena) పార్టీల మ‌ధ్య సీట్ల స‌ర్దుబాటు కుదురుతున్న స‌మ‌యంలో తెలుగు దేశం నేత జ‌లీల్ ఖాన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసారు. విజ‌య‌వాడ వెస్ట్‌లో త‌న‌కు కాకుండా జ‌న‌సేన నేత‌కు టికెట్ ఇస్తే ముస్లింలు ఉరేసుకుంటారు అంటూ చ‌ర్చ‌కు తెర‌లేపారు. “” విజయవాడ వెస్ట్ టికెట్ నాదే. అందరూ టికెట్ అడుగుతారు. కానీ గెలిచే స్తోమత ఉండాలి.. నాకు సీటు ఇవ్వకపోతే ముస్లిం మైనార్టీలు ఉరి వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు “” అని జ‌లీల్ తెలిపారు. జ‌లీల్ ఖాన్ మాట‌ల‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని తెలుగు దేశం కేడ‌ర్ జ‌న‌సేన‌కు స‌ర్దిచెప్పింది.