Mudragada: TDP గ్రాఫ్ పెంచిందే ప‌వ‌న్..!

Mudragada: కాపు సంఘం అధినేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం నిన్న‌నే YSRCPలో చేరారు. తాడేప‌ల్లిగూడెంలోని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (Jagan Mohan Reddy) ఇంటికి ఒంట‌రిగా వెళ్లిన ముద్ర‌గ‌డను కండువా క‌ప్పి జ‌గ‌న్ పార్టీలోకి ఆహ్వానించారు. అలా పార్టీలో చేరారో లేదో అప్పుడే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్‌పై దుమ్మెత్తిపోయ‌డం మొద‌లుపెట్టారు. ప‌వ‌న్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాల్లో హీరో అయితే తాను రాజ‌కీయాల్లో హీరో అని అన్నారు. కాపు జాతిని చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu) అవమానించినప్పుడు పవన్ ఎందుకు స్పందించలేద‌ని అన్నారు. నంద‌మూరి తార‌క రామారావు రాజ‌కీయాల్లోకి వచ్చిన‌ప్పుడు ప్ర‌జ‌లు న‌మ్మార‌ని ఇక ఏ సినిమా హీరోని ప్ర‌జ‌లు న‌మ్మ‌ద‌లుచుకోలేద‌ని తెలిపారు.

“”” చంద్ర‌బాబు నాయుడు జైలుకి వెళ్లాక తెలుగు దేశం పార్టీ గ్రాఫ్ పూర్తిగా ప‌డిపోయింది. ఆయ‌న్ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెళ్లి క‌ల‌వ‌డం వ‌ల్లే తెలుగు దేశం పార్టీ గ్రాఫ్ అమాంతం పెరిగింది. అలాంటి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు కేవ‌లం 20 సీట్లు ఇస్తే ఆ 20 సీట్ల‌కు నేనేం సేవ‌ చేయాలి? క‌నీసం చంద్ర‌బాబు నాయుడు అయినా మ‌నం స‌గం స‌గం చేసుకుందాం అని చెప్పాలి క‌దా..! పోనీ ప‌వ‌న్ అయినా అడ‌గాలి క‌దా..? అవేమీ చేయ‌కుండా ఇచ్చిన సీట్లు తీసుకుని పోటీ చేస్తానంటే నేను మాత్రం ఏం చేయ‌గ‌ల‌ను “”” అని తెలిపారు.