Siddaramaiah: రాహుల్ ప్ర‌ధాని అయితే బాగుంటుంది

Bengaluru: కర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో(karnataka elections) కాంగ్రెస్ విజ‌యం వైపు దూసుకెళుతుండ‌డంతో.. ఆ రాష్ట్ర మాజీ సీఎం సిద్ధారామ‌య్య(siddaramaiah) కీల‌క కామెంట్స్ చేసారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన భార‌త్ జోడో యాత్ర వ‌ల్లే ఈ విజ‌యం సాధించ‌గ‌లిగామ‌ని, ఆయ‌న ప్ర‌ధాని అయితే బాగుంటుంద‌ని అన్నారు. ఈ ఎన్నిక‌ల్లో డ‌బ్బుతో గెల‌వ‌చ్చ‌ని బీజేపీ పొర‌ప‌డింద‌ని, వారు ఎంతో ఖ‌ర్చు చేసిన‌ప్ప‌టికీ గెలుపు త‌మవైపే ఉంద‌ని అన్నారు. 2018 ఎన్నిక‌ల్లోనూ బీజేపీ డ‌బ్బుతో ఓట్ల‌ను కొన్నార‌ని, కానీ ఏ పార్టీ త‌మ‌కు రక్ష‌గా ఉంటుందో ప్ర‌జ‌ల‌కు తెలుస‌ని తెలిపారు.