HYDRAA Ranganath: జ‌గ‌న్‌కు నోటీసుల‌పై రంగ‌నాథ్ స్పంద‌న‌

HYDRAA Ranganath says he did not serve notice to jagan mohan reddy

HYDRAA Ranganath: హైద‌రాబాద్‌లోని లోట‌స్ పాండ్‌లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నివాసం కూడా FTL ప‌రిధిలోకి వ‌స్తుంద‌ని.. దాంతో ఆయ‌న‌కు హైడ్రా సంస్థ నోటీసులు ఇచ్చింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. రేపో మాపో జ‌గ‌న్ నివాసాన్ని కూడా కూల్చేస్తార‌ని అంటున్నారు. దీనిపై హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ స్పందించారు. జ‌గ‌న్ లోట‌స్ పాండ్ నివాసం FTL ప‌రిధోకి వ‌స్తుందో రాదో ప‌రిశీలించాల‌ని.. ఒక‌వేళ వ‌స్తే గ‌న‌క ఆయ‌న‌కు త‌ప్ప‌కుండా నోటీసులు ఇస్తామ‌ని తెలిపారు. ఇప్ప‌టికైతే జ‌గ‌న్‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వ‌లేద‌ని వెల్ల‌డించారు.