Kesineni Nani: కొడుకునే గెలిపించుకోలేనోడు మ‌ళ్లీ అధికారంలోకి ఎలా వ‌స్తారు?

Kesineni Nani: కొడుకునే గెలిపించుకోలేని వ్య‌క్తి మ‌ళ్లీ అధికారంలోకి ఎలా వ‌స్తారు అని ప్ర‌శ్నించారు YSRCP నేత కేశినేని నాని. విజ‌య‌వాడ ఎంపీగా తెలుగు దేశం పార్టీలో ఉన్న కేశినేని నానికి పార్టీ టికెట్ ఇవ్వ‌లేద‌ని ఆయ‌న YSRCPలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌పై ఎంపీగా చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu) పోటీ చేస్తే 3 ల‌క్ష‌ల మెజార్టీతో గెలుస్తాన‌ని అన్నారు. నారా లోకేష్ (Nara Lokesh) గ‌త ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గిరి నుంచి ఓడిపోయార‌ని.. అలాంటి వ్య‌క్తి మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తార‌ని ప్ర‌శ్నించారు.