Chandrababu ఇంటి వ‌ద్ద హై టెన్ష‌న్

Chandrababu Naidu: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఇంటి వ‌ద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు నాయుడు నివాసం వ‌ద్ద రంప‌చోడ‌వ‌రం సీటుపై కార్య‌క‌ర్త‌లు నానా హంగామా చేస్తున్నారు. రంప‌చోడ‌వ‌రం సీటును వంత‌ల రాజేశ్వ‌రికి కేటాయించ‌క‌పోవ‌డంపై వారు మండిప‌డుతున్నారు. అస‌లు చంద్ర‌బాబు నాయుడు నోటి నుంచి వ‌చ్చిన ఏ ఒక్క ప‌థ‌కం, హామీ గురించి తెలీని వ్య‌క్తికి సీటు ఎలా ఇస్తారు అంటూ వారు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు.

రంప‌చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ముక్కూ ముఖం తెలీని వ్య‌క్తికి సీట్లు ఇస్తే ఎలా ఓటేస్తారు అని ప్ర‌శ్నిస్తున్నారు. వారు చంద్ర‌బాబు నాయుడు ఇంటికి వెళ్లేందుకు య‌త్నించ‌గా పోలీసులు అడ్డుకున్నారు. గెలిచే సీటును కూడా ఓడిపోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. పార్టీ మేలు కోస‌మే చంద్ర‌బాబును క‌ల‌వడానికి వ‌చ్చామ‌ని వారు చెప్తున్నారు. మ‌రో ప‌క్క వంతల రాజేశ్వ‌రి క‌న్నీరుపెట్టుకున్నారు. నాలుగేళ్ల పాటు పార్టీకి సేవ‌లు చేసాన‌ని.. రంప‌చోడ‌వ‌రం ఇన్‌ఛార్జిగా ఉన్న త‌న‌ను కాద‌ని సీటును శిరీష అనే ఎవ‌రో పేరూ ఊరూ తెలీని వారికి ఎలా ఇస్తారు అని రాజేశ్వ‌రి ఆవేద‌న వ్య‌క్తం చేసారు. దాంతో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

ALSO READ: Chandrababu Naidu: ఆప‌రేష‌న్ చీపురుప‌ల్లి.. బాబు ప్లానేంటి?