Chandrababu: ఇక నుంచి ప‌ర్స‌న‌ల్ డాక్ట‌రే ప‌రీక్ష‌లు చేస్తారు

TDP అధినేత చంద్ర‌బాబు నాయుడుకు (chandrababu naidu) ఏపీ హైకోర్ట్ (ap high court) నుంచి కాస్త ఊర‌ట ల‌భించింది. కొంత‌కాలంగా రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న చంద్ర‌బాబుకు ఇక నుంచి జైలులోని వైద్య బృందం కాకుండా ఆయ‌న వ్య‌క్తిగ‌త డాక్ట‌రే అన్ని విధాల ప‌రీక్ష‌లు నిర్వ‌హించే అవ‌కాశాన్ని ఏపీ హైకోర్టు క‌ల్పించింది. చంద్ర‌బాబు నాయుడు జైలుకి వెళ్లిన త‌ర్వాత అనారోగ్యానికి గుర‌య్యార‌ని ఆయ‌న‌కు ఏమ‌న్నా జ‌రిగితే ఏపీ ప్ర‌భుత్వానిదే బాధ్య‌త అని చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యులు ఆరోప‌ణ‌లు చేసారు. ఈ నేప‌థ్యంలో హైకోర్టు సొంత డాక్ట‌ర్ ద్వారానే వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించేలా ఆదేశాలు జారీ చేసింది.