Vijay Sai Reddy: వారిని చంద్ర‌బాబు డ‌బ్బులిచ్చి విడిపిస్తాడు

దేశంలోని హవాలా ఆపరేటర్లు అందరూ TDP చంద్రబాబు నాయుడు (chandrababu naidu) కనుసన్నల్లోనే పనిచేస్తారని ఆరోప‌ణ‌లు చేసారు YSRCP నేత విజ‌య సాయి రెడ్డి (vijay sai reddy). వాళ్లెవరైనా డబ్బుతో దొరికితే వ్యవస్థల్లో తనకున్న పలుకుబడితో విడిపిస్తాడని షాపూర్జీ పల్లోంజీ సంస్థ నుంచి 118 కోట్లు కమీషన్‌గా తీసుకున్నట్టు ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులో షెల్ కంపెనీల ప్రతినిధులుగా పేర్కొన్న పేర్లన్నీ హవాలా ఆపరేటర్లవేన‌ని అన్నారు. “” అధికారం ఉంటే ప్రజలకు సేవచేసి మంచి పనులతో చరిత్రలో నాలుగు కాలాలు నిలిచిపోవచ్చని రాజకీయాల్లో ఉన్నవారు ఆశపడతారు. చంద్రబాబు అండ్ కంపెనీకి మాత్రం అధికారం ఉంటే యధేచ్ఛగా దోచుకోవడమే తెలుసు. అక్రమ సంపాదనను కాపాడుకోవాలంటే తప్పనిసరిగా పవర్ చేతిలో ఉండాలి. బాబుగారి ఆలోచన దీని చుట్టే తిరుగుతుంది “” అని ట్వీట్ల వ‌ర్షం కురిపించారు విజ‌య్ సాయి రెడ్డి. (vijay sai reddy)