AP Elections: “ప‌వ‌న్.. ఈ 3 జిల్లాల నుంచే పోటీ చేయ్”

AP Elections: సీనియ‌ర్ రాజ‌కీయ విశ్లేష‌కులు హ‌రిరామ జోగయ్య (hari rama jogayya) జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు (pawan kalyan) మ‌రో బ‌హిరంగ లేఖ రాసారు. మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌ను సూచించి ఇక్క‌డి నుంచి పోటీ చేస్తేనే గెలుపు త‌థ్య‌మ‌ని సూచించారు. న‌ర్సాపురం, గాజువాక, తిరుప‌తి నుంచి పోటీ చేస్తే ఏదో ఒక దానిలో గెలిచే అవ‌కాశం ఉంద‌ని సూచించారు. అంతేకాకుండా జ‌న‌సేన‌కు చెందిన 50 అభ్య‌ర్ధులు ఎక్క‌డి నుంచి పోటీ చేస్తే మంచిదో వివ‌రిస్తూ లేఖ‌లో పేర్కొన్నారు.