Amarnath: తండ్రి ఎన్టీఆర్‌ని.. కొడుకు ప‌వ‌న్‌ని వెన్నుపోటు పొడుస్తున్నారు

Amarnath:  జనసేన పార్టీ (janasena) రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌పై (nadendla manohar) మండిప‌డ్డారు ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్. ఏపీలో ఏ స్థాయిలో అభివృద్ధి జ‌రుగుతోందో రిజ‌ర్వ్ బ్యాంకే రిపోర్టులు ఇస్తుంటే నాదెండ్ల మ‌నోహ‌ర్ ప్ర‌జ‌ల‌కు లేని పోనివి చెప్పి త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. నాదెండ్ల మ‌నోహ‌ర్ తండ్రి తెలుగు దేశం పార్టీలో ఉండి చంద్ర‌బాబు నాయుడుతో క‌లిసి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాడ‌ని.. ఇప్పుడు మ‌నోహ‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వెన్నుపోటు పొడుస్తాడ‌ని అన్నారు. ప‌వ‌న్ అమాయ‌కుడు కాబ‌ట్టి మ‌నోహ‌ర్ చెప్పిన‌ట్లు వింటున్నాడ‌ని.. కానీ ప్ర‌జ‌లు అమాయ‌కులు కార‌ని పేర్కొన్నారు.