Gudivada Amarnath: రాజీనామాలు చేస్తే మాకు న‌ష్ట‌మేమీ లేదు

AP: YSRCP అనేది మ‌హాస‌ముద్ర‌మ‌ని, అందులో ఒక‌టి రెండు చేప‌లు చచ్చి బ‌య‌ట‌ప‌డిపోతే త‌మ పార్టీకి వ‌చ్చిన న‌ష్ట‌మేమీ లేద‌ని అన్నారు గుడివాడ అమ‌ర్నాథ్‌ (gudivada amarnath). YSRCP నేత పంచకర్ల రమేష్ బాబు (panchakarla ramesh babu) జ‌న‌సేన‌లో (janasena) చేరే విష‌యంపై గుడివాడ స్పందించారు.  ర‌మేష్ బాబు మా పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు చేరారు. ఆయ‌న పార్టీలో చేరి 2 సంవ‌త్స‌రాలు అయింది. పార్టీ భావ‌జాలం న‌చ్చో లేదా అధికారంలో ఉంద‌నో చాలా మంది చేరుతుంటారు. మా పార్టీ మ‌హాస‌ముద్రం లాంటిది. అందులో ఒక‌టి రెండు చేప‌లు చ‌చ్చిపోయి బ‌య‌ట‌ప‌డితే మాకు వచ్చే న‌ష్టం ఏమీ లేదు  అని తెలిపారు. జూలై 15న జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను (pawan kalyan) ర‌మేష్ బాబు క‌ల‌వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో పెందుర్తి (pendurthi) నుండే పోటీ చేయనున్నట్టు సమాచారం.