Tamilisai: తెలంగాణ ప్ర‌జలకు నిర్భంద‌పు పాల‌న నుంచి విముక్తి క‌లిగింది

Tamilisai: తెలంగాణ ప్ర‌జలకు BRS నిర్భంద‌పు పాల‌న నుంచి విముక్తి క‌లిగిందని అన్నారు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై. తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో ఆమె ప్ర‌సంగించారు. మార్పు కోసం ప్ర‌జ‌లు స్ప‌ష్ట‌మైన తీర్పునిచ్చార‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో తెలంగాణ స్వేచ్ఛాయువుల‌ను పీల్చుకుంటోంద‌ని తెలిపారు. “” గ‌త తొమ్మిదేళ్ల‌లో అన్ని సంస్థ‌ల‌ను నాశ‌నం చేసారు. ప్ర‌జాస్వామ్యంగా న‌డుచుకోవాల్సిన సంస్థ‌ల‌ను వ్య‌క్తిగ‌త ప‌నుల‌కు వాడుకున్నారు. ఇలా ఉంటే ప్ర‌జాస్వామ్యం అనే మాట‌కే అర్థం ఉండదు. ఈ ట్రెండ్‌ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిర్మూలించేసింది. ప్ర‌స్తుతానికి తెలంగాణ ప్ర‌భుత్వం ముందు ఉన్న ఏకైక ల‌క్ష్యం రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని మెరుగుప‌ర‌చ‌డం “” అంటూ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు గ‌వ‌ర్న‌ర్.