Gorantla Madhav: జ‌గ‌న్ వ‌స్తారు.. చంద్ర‌బాబు చ‌స్తారు

2024లో జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వస్తారు.. చంద్రబాబు నాయుడు చస్తారు అంటూ YSRCP ఎంపీ గోరంట్ల మాధవ్ (gorantla madhav) చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్ర‌స్తుతం ఏపీలో YSRCP బ‌స్సు యాత్ర‌లో భాగంగా ప‌ర్య‌ట‌న‌లు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో గోరంట్ల మాధ‌వ్ ఇలా ఓవ‌రాక్ష‌న్ చేసి మాజీ సీఎంను ప‌ట్టుకుని తీవ్రంగా వ్యాఖ్య‌లు చేసారు. ఇలాంటి వ్యాఖ్యల వల్లే ఇప్పుడు చంద్రబాబుపై YSRCP చేస్తుంది కక్ష సాధింపని అనిపించక మానదు. మరణాన్ని కొరుకునేంత స్థాయిలో పగలు, కక్షలు పెంచుకున్న వీళ్ళు నిష్పక్షపాతంగా పాలిస్తామంటే నమ్మేవారెవరూ?