Gone Prakash Rao: రేవంత్ డ‌బ్బు తీసుకుని పార్టీలో చేర్చుకుంటున్నాడు

TPCC అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy) కాంగ్రెస్ పార్టీని నాశ‌నం చేస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు సీనియ‌ర్ నేత గోనె ప్రకాశ్ రావు (gone prakash rao). పార్టీని విలీనం చేసి కాంగ్రెస్‌లో క‌ల‌వాల‌ని చూస్తున్న వైఎస్ షర్మిలని (ys sharmila) రాకుండా అడ్డుకుంటున్నాడని సమైక్య మద్దతుదారులు రావొద్దు అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు తీసుకున్నావని ప్ర‌శ్నించారు. ఆయ‌న నుంచి డబ్బులు తీసుకుని మ‌రీ పార్టీలో చేర్చుకున్నాడ‌ని ఆరోప‌ణ‌లు చేసారు. తుమ్మల నాగేశ్వ‌ర‌రావు, సమైక్య వాదంకి మద్దతిచ్చిన సిపిఎంతో పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారు అని తీవ్రంగా మండిపడ్డారు.