YS Sharmila: చంద్ర‌బాబు, జ‌గ‌న్‌కు ఛాన్స్ ఇచ్చారు.. మాకూ ఇవ్వండి

YS Sharmila: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu), జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిల‌కు (jagan mohan reddy) అవ‌కాశం ఇచ్చిన‌ట్లే ఒక్క‌సారి కాంగ్రెస్‌కు కూడా ఈసారి అవ‌కాశం ఇవ్వాల‌ని అన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిళ‌. ఏపీకి చంద్ర‌బాబు, జ‌గ‌న్ ఏమీ చేయ‌లేద‌ని తాము అధికారంలోకి వ‌స్తే ఏపీకి ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం ప్రాజెక్ట్ క‌చ్చితంగా వ‌స్తాయ‌ని.. కాంగ్రెస్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సిద్ధాంతాల‌పైనే న‌డుస్తోంద‌ని అన్నారు. ఈసారి ఎన్నిక‌ల్లో ఒక్క‌సారి కాంగ్రెస్‌కు అధికారం క‌ట్ట‌బెడితే.. ఆ త‌ర్వాత ప్ర‌జ‌లే ఈ నిర్ణ‌యం తీసుకుని మంచి ప‌ని చేసాం అనుకుంటార‌ని తెలిపారు.