Gangula Kamalakar: ప‌వ‌న్, ష‌ర్మిళ‌, కేఏ పాల్.. ఎవ‌ర్రా మీరంతా..!

క‌రీంన‌గ‌ర్ BRS అభ్య‌ర్ధి గంగుల క‌మ‌లాక‌ర్ (gangula kamalakar) ప్ర‌చార కార్య‌క్ర‌మంలో ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైర‌ల్ అవుతున్న కార్తి డైలాగ్ ఎవ‌ర్రా మీరంతా అనే మాట‌తో ప్ర‌చారానికి కొత్త ఊపు తెచ్చారు. KCRను ఓడిస్తే తెలంగాణ ప్ర‌జ‌లే ఓడిపోతార‌ని.. ఒక్క‌సారి ఓటు త‌ప్పుడు వ్య‌క్తుల‌కు వేస్తే ఇక ఐదేళ్ల వ‌ర‌కు న‌ర‌కం చూడాల్సి వ‌స్తుంద‌ని అన్నారు.

KCRకి పోటీగా ష‌ర్మిళ (ys sharmila), ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ (pawan kalyan), కిర‌ణ్ కుమార్ రెడ్డి (kiran kumar reddy), బండి సంజ‌య్ (bandi sanjay), కేఏ పాల్ (ka paul) వీరంతా వ‌చ్చార‌ని.. అస‌లు వీరంతా తెలంగాణ‌లో ఎందుకు పోటీ చేస్తున్నారో ఇప్ప‌టికీ అర్థంకావ‌డంలేద‌ని క‌మ‌లాక‌ర్ పంచులు వేసారు. కాంగ్రెస్ నేత‌లు ప్ర‌చార స‌మ‌యంలో హార‌తి ఇచ్చి డ‌బ్బులు ఇస్తే త‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని కానీ ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాల‌ని క‌మ‌లాక‌ర్ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. వారు ఇచ్చే డ‌బ్బులు తీసుకోవ‌డంలో త‌ప్పు లేద‌ని అది ప్ర‌జ‌ల సొమ్మే అని తెలిపారు.