Operation Ajay: భార‌తీయుల కోసం ఇజ్రాయెల్‌కి మొద‌టి విమానం

యుద్ధ దాడుల‌తో అల్లాడిపోతున్న ఇజ్రాయెల్‌లో (israel) చిక్కుకున్న భార‌తీయుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్ అజ‌య్‌ను (operation ajay) ప్రారంభించింది. ఈ ఆప‌రేష‌న్‌లో భాగంగా ఈరోజు రాత్రి మొదటి విమానాన్ని ఇజ్రాయెల్‌కు పంప‌నుంది. రేప‌టి క‌ల్లా అక్క‌డున్న భార‌తీయులు క్షేమంగా ఇండియా చేరుకుంటారని భార‌త విదేశాంగ్ శాఖ మంత్రి జైశంక‌ర్ (jai shankar) తెలిపారు. ఈ మేర‌కు భార‌తీయ విద్యార్థుల‌కు ఒక అధికారిక గూగుల్ ఫాం పంపించారు. వారు ఆ ఫాంలో వివ‌రాలు న‌మోదు చేసి స‌బ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క‌రు 2 కిలోల ల‌గేజ్ మాత్ర‌మే తీసుకురావాల‌ని ఆదేశించారు.