Telangana Results: ఎట్ట‌కేల‌కు బోణీ కొట్టిన BRS..!

Telangana Results: ఎట్ట‌కేల‌కు BRS పార్టీ ఒక సీటు గెలుచుకుని బోణీ కొట్టింది. దుబ్బాక నుంచి పోటీ చేసిన కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి గెలిచారు. ప్ర‌స్తుతానికి BRS పార్టీ 38 సీట్ల‌లో ముందంజ‌లో ఉంది. కాంగ్రెస్ పార్టీ నాలుగు సీట్లలో గెలిచి 60 స్థానాల్లో ముందంజ‌లో ఉంది. కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి ప్ర‌చార కార్య‌క్ర‌మంలో ఉండ‌గా ఆయ‌న‌పై క‌త్తి దాడి జరిగింది. పెద్ద ప్ర‌మాదం నుంచే బ‌య‌ట‌ప‌డ్డాడు. ఆ సానుభూతితో ప్ర‌జ‌లు ఓటు వేసి గెలిపించిన‌ట్లు తెలుస్తోంది.