chandrababu: జగన్‌ మీ బిడ్డ కాదు.. క్యాన్సర్‌ గడ్డ

vijayawada: ఏపీలోని ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా.. మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(ex cm chandrababu naidu) ఇవాళ.. విజయవాడ(vijayawada)కు వచ్చారు. ఈ సందర్బంగా విజయవాడకు చెందిన నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి'(idhem karma mana rastraniki programme) అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఈ సందర్బంగా సీఎం జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ మీ బిడ్డ కాదని.. క్యాన్సర్‌ గడ్డ అని ఆయన విమర్శించారు. జగన్‌ క్యాన్సర్‌ వంటి వారని.. ఈ సమాజానికి క్యాన్సర్‌ లాగా పట్టిపీడిస్తున్నారని దీనికి చికిత్స అవసరమని చంద్రబాబు మండిపడ్డారు. మరోవైపు ఇవాళ సాయంత్రానికి ఆయన పెనమలూరు మీదుగా.. మచిలీపట్నం వెళ్లనున్నారు. ఇక రెండు రోజులపాటు గుడివాడలో ఉండనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, అధికార ప్రతినిధి పట్టాభిరామ్, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు.