Etela Rajender: మ‌ల్కాజ్‌గిరి ఎంపీగా..!

Etela Rajender: BJP నేత ఈటెల రాజేంద‌ర్ లోక్ స‌భ ఎన్నిక‌ల్లో (lok sabha elections) మ‌ల్కాజ్‌గిరి టికెట్‌ను ఆశిస్తున్నారు. ఎంపీ సీట్ల‌పై ముందు నుంచే BJP సైన్యం అలెర్ట్‌గా ఉంది. సిట్టింగ్ స్థానాల నుంచి బండి సంజ‌య్, అర్వింద్ ధ‌ర్మ‌పురి, సోయం బాపురావులు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఓ వైపు రేణుకా చౌద‌రి ఖ‌మ్మం నుంచి పోటీ చేసే హ‌క్కు త‌న‌కు మాత్ర‌మే ఉంది అని స‌వాల్ విసురుతుండ‌గా.. మ‌రోవైపు పాల‌మూరు టికెట్ కోసం జితేంద‌ర్ రెడ్డి, డీకే అరుణ నువ్వా నేనా అనే రేంజ్‌లో విమ‌ర్శించుకుంటున్నారు. దాంతో కాంగ్రెస్ అధిష్టానానికి టికెట్లు ఎలా ఇవ్వాలో అర్థంకాక త‌ల‌ప‌ట్టుకుంది.