Errabelli: వ‌రంగ‌ల్‌లో ఫిలిం స్టూడియో పెట్టండి!

Hyderabad: అక్కినేని అఖిల్(Akkineni Akhil), సాక్షి వైద్య(Sakshi Vaidya) జంటగా నటించిన తాజా చిత్రం ఏజెంట్​(Agent). డైరెక్టర్​ సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో అనిల్ సుంకర(Anil Sunkara) నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదల కానుంది. మొదటి సారి అఖిల్ పూర్తిగా మాస్, యాక్షన్ సినిమాతో రానుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి(Mammootty) ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై అంచనాలు పెంచారు మేకర్స్​. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ఇప్పటికే ప్రమోషన్స్​తో ఫుల్ బిజీగా ఉంది చిత్రయూనిట్.

తాజాగా ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం వరంగల్ లో భారీగా నిర్వహించారు. ఈ ఈవెంట్​కు ముఖ్య అతిథిలుగా నాగార్జున(Nagarjuna) తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు (Errabelli Dayakar Rao) మాట్లాడుతూ.. ‘వరంగల్ లో ఏ సినిమా తీసినా హిట్ అవుతుంది. స్టార్ హీరోలు అంతా ఇక్కడ సినిమాలు చేశారు. వరంగల్ లో సినిమా ప్రమోషన్స్ చేసిన అన్ని సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ఏ సినిమా చేసినా వరంగల్ లో ప్రమోషన్స్ చేయండి. నేను చూసుకుంటా.  సినీ ప్రముఖులు అందరికీ చెప్తున్నా, ఇక్కడ ఫిలిం స్టూడియో పెట్టండి. KCR తో మాట్లాడి నేను స్థలం ఇప్పిస్తాను. మీకు ఎంత జాగా కావాలన్నా అంత ఇప్పిస్తాను. స్టూడియో పెట్టె బాధ్యత మీదే. తెలంగాణ వచ్చాక హైదరాబాద్ తర్వాత అంత గుర్తింపు ఒక్క వరంగల్ కే వచ్చింది. ప్లీజ్ ఇక్కడ ఒక్క స్టూడియో పెట్టండి. మీకు ఏ విషయంలో సపోర్ట్ కావాలన్నా ఉంటాను’ అని అన్నారు.