Election Campaign: నేడే చివ‌రి రోజు..!

Election Campaign: తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారానికి నేడే చివ‌రి రోజు. ఈరోజు సాయంత్రం 5 గంట‌ల‌కు ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌న్నీ ముగియ‌నున్నాయి. తెలంగాణ‌లోని 13 నియోజ‌క‌వ‌ర్గాల్లో గంట ముందే ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ముగియ‌నున్నాయి. మావోయిస్టు ప్ర‌దేశాల్లో పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటుచేసారు. ప్ర‌చారం ముగిసే స‌మ‌యానికి స్థానిక అభ్య‌ర్ధులు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉండేందుకు వీల్లేదు. ఎలాంటి ఇంట‌ర్వ్యూలు, మీడియా స‌మావేశాలు ఏర్పాటుచేసేందుకు వీల్లేదు. 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో మొత్తం 2290 మంది అభ్య‌ర్ధులు బ‌రిలో ఉన్నారు. గురువారం పోలింగ్ జ‌ర‌గ‌నుంది.