Duvvada Srinivas: భార్యాభ‌ర్త‌ల గొడ‌వ‌.. ఆ అవ‌కాశం జ‌గ‌న్‌కే ద‌క్కింది

duvvada srinivas talks about jagan involvement

Duvvada Srinivas: కొంత‌కాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కాపురంలో జ‌రుగుతున్న గొడ‌వ‌పై ఇప్ప‌టివ‌ర‌కు పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఒక్క‌సారి కూడా స్పందించ‌లేదు. దీనిపై దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. ఇది తన కుటుంబ వ్య‌వ‌హారం కాబ‌ట్టే జ‌గ‌న్ బ‌హిరంగంగా స్పందించ‌లేద‌ని అన్నారు. అయితే గ‌త ఐదేళ్ల‌లో త‌న భార్య వాణి ఇలాగే గొడ‌వ‌లు ప‌డుతుంటే జ‌గ‌నే స్వ‌యంగా త‌మ ఇద్దరినీ పిలిపించి న‌చ్చ‌జెప్పేందుకు ప్ర‌య‌త్నించార‌ని అన్నారు. అలా ఒక‌సారి కాదు రెండు సార్లు కాదు దాదాపు ఐదు సార్లు జ‌గ‌న్ త‌మ‌ను పిలిచి మాట్లాడార‌ని.. ఇలా భార్యాభ‌ర్త‌ల గొడ‌వ విష‌యంలో ఓ ముఖ్య‌మంత్రి జోక్యం చేసుకునే అవ‌కాశం ఒక్క జ‌గ‌న్‌కే వ‌చ్చింద‌ని అన్నారు. స్వ‌యాన అధినేత చెప్పినా కూడా త‌న భార్య మాట విన‌లేద‌ని విమ‌ర్శించారు. అలాంటిది ఇప్పుడు అధికారం కోల్పోయిన అధిష్ఠానం త‌మ విష‌యంలో ఏం చేయ‌గ‌లుగుతుంది అని దువ్వాడ శ్రీనివాస్ వెల్ల‌డించారు.