Thummala: లోన్లు క‌ట్ట‌ని రైతుల‌ను వ‌దిలిపెట్ట‌ద్దు.. మంత్రి ఆదేశాలు

Thummala: లోన్లు కట్టని రైతులను వదిలిపెట్టొద్దు అంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేయ‌డం వివాదాస్ప‌దంగా మారింది. లోన్లు కట్టని రైతులే కాదు రికవరీ చేయని అధికారుల మీద సైతం వారం రోజుల్లో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించార‌ట‌. ఎన్నికల ముందు 2 లక్షల రుణ మాఫీ చేస్తాం అని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు లోన్లు కట్టని రైతుల మీద చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయ‌డంపై ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుతున్నాయి.