Vijaya Sai Reddy: YSRCPలో సాయి రెడ్డిని టార్గెట్ చేసింది ఎవ‌రు?

did sajjala ramakrishna reddy targeted vijaya sai reddy

Vijaya Sai Reddy:  వైఎస్సార్ కాంగ్రెస్‌లోని సీనియ‌ర్ నేత‌ల్లో ఒక‌రైన విజ‌య సాయి రెడ్డిపై ఎన్నో ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కానీ ఇలా ఓ మ‌హిళ ప‌ట్ల త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించి ఆమె గ‌ర్భానికి కార‌ణ‌మ‌య్యారు అని తొలిసారి వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై పార్టీ కూడా ఖంగుతింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ అయిన క‌లింగిరి శాంతి భ‌ర్త మ‌దన్ మోహ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసాడు.

తాను అమెరికాలో ఉన్న‌ప్పుడు త‌న భార్య గ‌ర్భం దాల్చింద‌ని..ఇందుకు కార‌ణం విజ‌య‌సాయి రెడ్డే అని అనుమానంగా ఉంద‌ని ఆరోపించాడు. ఇది త‌ప్ప‌ని నిరూపించాలంటే విజ‌య సాయి రెడ్డి డీఎన్ఏ ప‌రీక్ష‌కు రావాల్సిందే అని హెచ్చ‌రించాడు. లేదంటే నిరాహార దీక్ష‌కు దిగుతాన‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడు.

మ‌రోప‌క్క విజ‌య సాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి త‌న‌పై ఇలాంటి నీచ‌పు ఆరోప‌ణ‌లు చేస్తున్న తెలుగు దేశం పార్టీ వారిని వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఉన్న కొంద‌రు వ్య‌క్తుల‌ను ఊరికే వ‌దిలిపెట్ట‌ను అని హెచ్చ‌రించారు. ఆయ‌న తెలుగు దేశం పార్టీ వారిపై ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటే ఓ అర్థం ఉంది. కానీ సొంత పార్టీకి చెందిన కొంద‌రు నేత‌ల‌పై కూడా ఆయ‌న అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

దాంతో విజ‌య సాయిని సొంత పార్టీ నుంచి ఎవ‌రు టార్గెట్ చేస్తున్నారా అనే చర్చ మొద‌లైంది. కొంత‌వ‌ర‌కు విజ‌య‌సాయికి మాజీ విప్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి మ‌ధ్య వైరం ఉంద‌ని.. పార్టీ బాధ్య‌త‌లు స‌జ్జ‌ల తీసుకుని పార్టీ సోషల్ మీడియా వింగ్ బాధ్య‌త‌లు త‌న కుమారుడు భార్గ‌వ రెడ్డికి ఇవ్వ‌డంతో భార్గ‌వ్ కొన్ని పార్టీ ఫండ్స్‌ని తినేసాడ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అందుకే పార్టీ ఎన్నిక‌ల్లో ఓడిపోయింద‌ని విజ‌య‌సాయి ప‌లుమార్లు అన్నార‌ట‌. దాంతో స‌జ్జ‌ల‌కు కోపం వ‌చ్చి విజ‌య‌సాయిపై ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయిస్తున్నాడ‌నే టాక్ మొద‌లైంది. త‌న‌పై ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్న సొంత పార్టీ నేత‌లు ఎవ‌రో విజ‌య‌సాయే బ‌య‌ట‌పెట్టాలి.