మాల్దీవుల్లో 28 ద్వీపాలు కొన్న భార‌త్‌?

did india buy 28 islands in maldives

India: భార‌త ప్ర‌భుత్వం మాల్దీవుల నుంచి 28 ద్వీపాలు కొనుగోలు చేసిన‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ద్వీపాల‌న్నింటి ఖ‌రీదు దాదాపు రూ.1000 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ట‌. విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి జైశంక‌ర్ ఆగ‌స్ట్ 9న మాల్దీవుల అధ్య‌క్షుడు మ‌యిజ్జుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో 28 ద్వీపాల కొనుగోలు జ‌రిగింద‌ని టాక్. మ‌రోప‌క్క భార‌త్ ఎలాంటి ద్వీపాలు కొన‌లేద‌ని కాక‌పోతే 28 ద్వీపాల్లో నీటి, మురుగు నీటి ప్రాజెక్ట్‌లు క‌ట్ట‌బోతున్నార‌న్న వాద‌న‌లు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ల‌కు భార‌త ప్ర‌భుత్వం ఫండ్స్ ఇస్తోంద‌ట‌.