Telangana Elections: దామోదర రాజనర్సింహ వర్సెస్ జగ్గారెడ్డి

Telangana Elections: పటాన్‌చెరు టికెట్ త‌న మ‌ద్దతుదారుడైన‌ కాట శ్రీనివాస్ గౌడ్‌కి ఇవ్వకపోవడంతో రాజనర్సింహ (damodar raja narsimha) ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదంతా జ‌గ్గారెడ్డే (jagga reddy) తెర వెనుక ఉండి మ‌రీ న‌డిపిస్తున్నార‌ని ఆరోపించారు. పటాన్‌చెరు అభ్యర్ధి నీలం మధుని మారిస్తే త‌న‌ నిర్ణయం తాను తీసుకుంటాను అని ఏఐసీసీ నేతలకు ఫోన్ చేసి జ‌గ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.