Jagan: అంద‌రికీ మీపై న‌మ్మ‌కం ఉంది.. అంబ‌టి రాయుడు కామెంట్స్

Hyderabad: క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు(ambati rayudu).. ఏపీ సీఎం జ‌గ‌న్‌(jagan)పై చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. “మా న‌మ్మ‌కం నువ్వే జ‌గన్” కార్య‌క్ర‌మంలో భాగంగా జ‌గ‌న్ ప్ర‌సంగం గురించి రాయుడు స్పందించాడు. గొప్ప స్పీచ్.. రాష్ట్ర ప్ర‌జ‌లు అంద‌రికీ మీపై నమ్మ‌కం ఉంది స‌ర్ అని ట్వీట్ చేసాడు. దాంతో ఈ ట్వీట్ కాస్తా వైర‌ల్‌గా మారింది. మీ వ్య‌క్తిగ‌త అభిప్రాయం చెప్ప‌కుండా రాష్ట్ర ప్ర‌జ‌లు అంద‌రికీ న‌మ్మ‌కం ఉన్న‌ట్లు మీరెలా చెప్తారు అని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

మ‌రోప‌క్క రాయుడు రాజకీయాల్లోకి ఎంట్రీ(political entry) ఇవ్వనున్నట్లు చెప్పడం ఆసక్తికరంగా మారింది. మరి అంబటి రాయుడు ఏ పార్టీలో చేరతారు అన్నదానిపై చర్చనడుస్తోంది. ఈ ఐపీఎల్‌ సీజన్‌ ముగిసిన తర్వాత.. రాయుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడంట. గుంటూరు జిల్లాకు చెందిన రాయుడు.. ఎన్నికల్లో అరంగ్రేటం గురించి పలు విషయాలు తెలియజేశారు. రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నానని.. ప్రజలకు సేవ చేసేందుకు ఇదే ఉత్తమ మార్గం అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఏ పార్టీలో చేరతాన్నది స్పష్టం చేయలేదు. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు.. తన సొంత జిల్లా అయిన గుంటూరు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం ఉంది.

ఏపీలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు. ఏ పార్టీలో చేరుతారు అన్నదానిపై స్పష్టత లేదు. అయితే ఏపీ బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌(brs thota chandra shekar) ఇప్పటికే రాయుడిని తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు జనసేన(janasena) పార్టీలో కూడా రాయుడు చేరే అవకాశం లేకపోలేదు. ఇక వైసీపీ(ycp), టీడీపీ(tdp)లో చేరినా.. పోటీ చేసే అవకాశం రాయుడికి ఇవ్వరు. ఎందుకంటే ఇప్పటికే గుంటూరులో ఎక్కడికక్కడ నాయకులు ఆయా స్థానాల్లో ఫిక్స్‌ అయి ఉన్నారు. రాయుడికి అవకాశం ఉన్నదల్లా బీఆర్‌ఎస్‌, లేదా జనసేన ఆప్షన్లు మాత్రమే.