CPI Narayana: “ముందు నాగార్జున‌పై కేసు పెట్టాలి”

CPI Narayana: బిగ్ బాస్ (biggboss) వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న అక్కినేని నాగార్జున‌పై (akkineni nagarjuna) కేసు పెట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు నారాయ‌ణ‌. బిగ్ బాస్ లాంటి వివాదాస్పద షోను కొన‌సాగించ‌డ‌మే నేరం అంటుంటే TRP రేటింగ్‌లు పెంచుకోవ‌డానికి అందులోకి రైతుల‌ను తీసుకొచ్చి మ‌రీ ఓవ‌ర్ చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఈ షోను చాలా మంది సీరియ‌స్‌గా తీసుకుంటున్నార‌ని పైసా ఉప‌యోగం లేని ఈ షో వ‌ల్ల ఘ‌ర్ష‌ణ‌లు జ‌రుగుతున్నాయ‌ని ఫ‌లితంగా ప్ర‌జల‌కు అసౌక‌ర్యం క‌లిగించేలా ఉంటోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 7 విజేత‌గా నాగార్జున రైతు అయిన ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌ను ప్ర‌క‌టించారు. దాంతో ర‌న్న‌ర‌ప్ అయిన అమ‌ర్‌దీప్ చౌద‌రి ఫ్యాన్స్ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ ఫ్యాన్స్ మ‌ధ్య పెద్ద వివాదం చోటుచేసుకుంది. కార్లు, బ‌స్సుల‌పై రాళ్లు రువ్వి నానా హంగామా చేసారు. దాంతో ప్ర‌శాంత్‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి సుమోటోగా తీసుకోనున్నారు.