CPI Congress: పొత్తు కాస్తా చిత్తు అయిపోయింది..!

రానున్న తెలంగాణ ఎన్నిక‌ల్లో (telangana elections) క‌లిసి బ‌రిలోకి దిగాల‌ని పొత్తు పెట్టుకున్నాయి CPI కాంగ్రెస్ (cpi congress). ఇప్పుడు ఆ పొత్తు కాస్తా చిత్తుగా అయిపోయింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ (congress) నుండి మునుగోడు సీట్ తీసుకోవాలని నల్గొండ జిల్లా నేతలు CPI కార్యాలయం రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశంలో గొడవకు దిగారు. CPIకి మునుగోడుకు బదులు కాంగ్రెస్ చెన్నూర్ నియోజ‌క‌వ‌ర్గాన్ని కేటాయించింది. CPI అడిగిన 5 సీట్లల్లో అస‌లు చెన్నూర్ లేదు. దాంతో త‌మ‌కు అభ్యర్థి లేని చెన్నూర్ ఇచ్చి చేతులు దులుపుకుంటే ఎలా అని సమావేశంలో ర‌చ్చ జ‌రిగింది.