Telangana Elections: CPI కాంగ్రెస్ మధ్య కుదిరిన పొత్తు

Telangana Elections: CPI కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. CPIకి కొత్తగూడెం స్థానం.. ఎన్నికల తరువాత 2 ఎమ్మెల్సీలు ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం అంగీక‌రించింది. ఇందుకు CPI కూడా సుముఖత చూపింది. అయితే CPMకి మాత్రం పొత్తు కుద‌ర‌లేదు. కాంగ్రెస్ వారికి అస‌లు పొత్తుపై ఎలాంటి క్లారిటీ లేద‌ని త‌మ్మినేని వీర‌భ‌ద్రం మండిప‌డ్డారు. నిన్న పోటీ చేయ‌నున్న అభ్య‌ర్ధుల జాబితాను CPM ప్ర‌క‌టించింది. పొత్తుపై ఇంకోసారి ఆలోచించండి అని మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క కోరిన‌ప్ప‌టికీ అవ‌స‌రం లేద‌ని త‌మ్మినేని వీర‌భ‌ద్రం కాంగ్రెస్‌కు గ‌డ్డిపెట్టారు.