Sukesh Chandrashekhar: అక్కా.. జైల్లో ఎదురుచూస్తుంటా.. త్వ‌ర‌గా వ‌చ్చేయ్!

Sukesh Chandrashekhar: రూ.200 కోట్ల మ‌నీ లాండ‌రింగ్ స్కాంలో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో శిక్ష అనుభ‌విస్తున్న మోస‌గాడు సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్.. భార‌త రాష్ట్ర స‌మితి (BRS) ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను (Kalvakuntla Kavitha) ఉద్దేశిస్తూ జైలు నుంచి ఓ లేఖ‌ను విడుద‌ల చేయించాడు. ఢిల్లీ లిక్క‌ర్ కేసులో (Delhi Liquor Scam) భాగంగా ఈడీ గ‌త శుక్ర‌వారం క‌విత‌ను అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. 22 వ‌ర‌కు క‌విత ఈడీ రిమాండ్‌లో ఉండ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో సుఖేష్ ఓ లేఖను విడుద‌ల చేసాడు. అందులో ఏముందంటే..

“” అక్కా.. నేను ఆరోజే చెప్పా. భార‌త రాష్ట్ర స‌మితి ఎన్నిక్ల‌ల్లో ఓడిపోతుంద‌ని.. మీ అక్ర‌మాల‌న్నీ బ‌య‌ట‌ప‌డ‌తాయని. నేను చెప్పిన‌ట్లే రెండూ జ‌రిగాయి. అధికారంలో ఉన్నాన‌ని అస్స‌లు దొర‌క‌మ‌ని అనుకున్నారు. కానీ ఇప్పుడు భార‌త చట్టం మారిపోయి మరింత ప‌వ‌ర్‌ఫుల్‌గా మారింది. ఇక మీరు ఎంత దాచాల‌ని చూసినా నిజం దాగ‌దు. మీ కోసం నేను తిహార్ జైల్లో వేచి చూస్తుంటాను. ఇప్పుడు మీతో పాటు అవినీతిలోనే రాజైన అర‌వింద్ కేజ్రీవాల్ గుట్టు కూడా ర‌ట్ట‌వుతుంది. సింగ‌పూర్‌, హాంకాంగ్, జర్మ‌నీల నుంచి మీరు మీ పార్టీలు దోచుకున్న వేల కోట్ల రూపాయ‌లు ఇప్పుడు బ‌య‌టికి వ‌స్తాయి. “” అని పేర్కొన్నాడు.

ALSO READ: Bhanu Priya: KTRని ఎదిరించి.. క‌విత‌ను అరెస్ట్ చేసిన ఈ లేడీ డాన్ ఎవ‌రు?