Tirumala Laddoo: ఒకే దేశం.. ఒకే త‌ల్లి

congress reveals tirumala laddoo propaganda

Tirumala Laddoo: తిరుమ‌ల ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వాడారు అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఓ ల్యాబ్ రిపోర్టు బ‌య‌ట‌పెట్టే వ‌ర‌కు ఎవ్వ‌రికీ ఈ సంగ‌తి తెలీదు. అంత‌కుముందు వ‌ర‌కు ఎవ్వ‌రూ కూడా తిరుమ‌ల ల‌డ్డూ తిని అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు కానీ.. రుచి మారింద‌ని ఫిర్యాదు చేసిన‌ట్లు కానీ దాఖ‌లాలు లేవు.  అయితే.. చంద్ర‌బాబు నాయుడు మాత్రం చాలా మంది అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు ట్విట‌ర్‌లో పోస్ట్‌లు పెడుతున్న‌ట్లు చెప్తున్నారు. ఇప్పుడు ఆ పోస్ట్‌ల‌కు సంబంధించిన ఓ స్క్రీన్‌షాట్‌ను కాంగ్రెస్ అధికారిక పార్టీ ట్విట్‌లో పోస్ట్ చేసింది. అందులో చాలా మంది నెటిజ‌న్లు త‌మ త‌ల్లులు తిరుమ‌ల ల‌డ్డూ తిని అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌ని.. ల‌డ్లు ఎవ్వ‌రూ తిన‌ద్దు అని చెప్పార‌ని రాసుంది. పైగా అంద‌రూ ఒకే ట్వీట్‌ని కాపీ చేసి పేస్ట్ చేసారు. దీనిపై కాంగ్రెస్ విమ‌ర్శిస్తూ… ఒకే దేశం ఒకే ఎన్నిక‌లు లాగా.. ఇది ఒకే దేశం ఒకే తల్లి ప్లాన్‌గా ఉంది అని ట్వీట్ చేసింది.

Tirumala Laddoo controversy