Congress: ఇద్ద‌రు భార్య‌లుంటే రూ.2 ల‌క్ష‌లు..!

congress promises 2 lakh rupees for 2 wives

Congress: మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం కింద ఇద్ద‌రు భార్య‌లు ఉంటే రూ.2 ల‌క్ష‌లు వ‌స్తాయంటూ కాంగ్రెస్ నేత కాంతిలాల్ భూరియా ప్ర‌చారం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ర‌త్లాం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న కాంతిలాల్ భూరియా ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఈ కామెంట్ చేసారు. “” మేం ప్ర‌వేశ‌పెట్టిన మ‌హాల‌క్ష్మి ప‌థకంలో భాగంగా మేం అధికారంలోకి రాగానే ఇంటి గృహిణికి రూ.1 ల‌క్ష బ్యాంక్ ఖాతాలో ప‌డుతుంది. ఇద్ద‌రు భార్య‌లు ఉంటే రూ.2 ల‌క్ష‌లు వ‌స్తాయి “” అన్నారు. దాంతో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆగ్ర‌హం వ్యక్తం చేసింది. ఇంత చీప్‌గా ఆలోచించే వారు రాజ‌కీయాల‌కు అర్హులు కాదు అని మండిప‌డింది.