G20 Summit: ఖ‌ర్గేకి అంద‌ని ఆహ్వానం

త్వ‌ర‌లో దేశ రాజ‌ధాని ఢిల్లీలో జీ20 స‌మ్మిట్‌ (g20 summit) అట్ట‌హాసంగా జ‌ర‌గ‌బోతోంది. స‌మ్మిట్ జ‌ర‌గడానికి ముందు రేపు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో విందు ఏర్పాటుచేయ‌నున్నారు. ఈ విందుకు  కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు (mallikarjun kharge) ఆహ్వానం అంద‌లేదు. ఈ విష‌యాన్ని ఆయ‌న పార్టీ అధికారులు వెల్ల‌డించారు. దేశంలోనే అతిపెద్ద ప్ర‌తిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌కి ఖ‌ర్గే చీఫ్‌. పార్టీలోని ముఖ్య‌నేత‌ల్లో ఆయ‌న ఒక‌రు. అలాంటిది ఆయ‌న‌కు ఆహ్వానం అంద‌క‌పోవ‌డంపై కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. అయితే ఈ డిన్న‌ర్‌క ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన ఏ లీడర్ల‌ను కూడా పిల‌వ‌లేద‌ని తెలుస్తోంది.. (g20 summit)