Congress: అయ్యా క‌రెంటును ఏమీ చెయ్య‌కండ‌య్యా..!

Hyderabad: కాంగ్రెస్ నేత‌ నాగం జనార్ధన్ రెడ్డికి (nagam janardhan reddy) 3 గంటల కరెంట్ నిరసన సెగ త‌గిలింది. TPCC అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy) చేసిన కామెంట్స్ వ‌ల్ల ఇప్పుడు ఇత‌ర కాంగ్రెస్ (congress) నేత‌లు చిక్కుల్లో ప‌డుతున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ (congress) నేత‌లు ఎక్క‌డ క‌నిపించినా స్థానిక రైతులు ఎక్క‌డిక‌క్క‌డ కరెంట్ గురించి నిల‌దీసేస్తున్నారు. ఇప్పుడు ఈ ప‌రిస్థితి నాగం జ‌నార్థ‌న్ రెడ్డికి ఎదురైంది. నాగర్ కర్నూలులో జనార్ధన్ రెడ్డిని రైతులు అడ్డుకున్నారు. “అయ్యా కరెంటును మాత్రం ఏమీ చేయకండి. మీరు ఉన్నపుడు 3 గంటలు ఇచ్చారు. తెల్లవార్లూ నిద్రకి సచ్చినం. ఇప్పుడు 24 గంటలు వస్తుంది కరెంటును మాత్రం ఏమీ చేయకండి” అంటూ రైతులు నిలదీశారు.