Congress నేత జానారెడ్డికి గుండెపోటు

Hyderabad: తెలంగాణ కాంగ్రెస్‌(congress) సీనియర్‌ నాయకులు జానారెడ్డి(jana reddy) ఇవాళ ఉదయం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారుజామున ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని సోమాజిగూడలోని యశోదా(yashoda) ఆసుపత్రికి తరలించారు. జానారెడ్డికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. యాంజియో గ్రామ్ తీసి.. గుండెకు రక్తం సరఫరా అయ్యే వాల్వ్ మూసుకుపోయినట్లు గుర్తించారు. వెంటనే స్టంట్ వేశారు. ప్రస్తుతం జానారెడ్డి(jana reddy) యశోదా ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.