Rythu Bandhu: రైతు బంధులో మార్పులు.. ఎవ‌రికి వ‌ర్తిస్తుంది?

Rythu Bandhu: తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (revanth reddy) రైతు బంధు అంశంలో కీల‌క మ‌ర్పులు చేసారు. గ‌త ప్ర‌భుత్వం బీడు భూముల‌కు కూడా రైతు బంధు ఇచ్చేది. కానీ ఈ ప్ర‌భుత్వం మాత్రం సాగు చేసే భూముల‌కే రైతు బంధు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఓ రైతు ఎన్ని ఎక‌రాల్లో సాగు చేస్తే అన్ని ఎక‌రాలకు రైతు బంధు వ‌స్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న‌వారికే ఈ సాగు సాయం ల‌భిస్తుంది. తెలంగాణ‌లో భూములు పెట్టుకుని ఇత‌ర రాష్ట్రాల్లో నివ‌సించేవారికి మాత్రం రైతు బంధు వ‌ర్తించ‌దు. అదే విధంగా సాగు చేసే భూముల‌పై ఎలాంటి ప‌రిమితి కూడా ఉండ‌దు.