Train Accident: కాసేప‌ట్లో విజ‌య‌న‌గ‌రానికి సీఎం జ‌గ‌న్

Visakhapatnam Rayagada Train Accident: నిన్న రాత్రి విజ‌య‌న‌గ‌రంలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్ర‌మాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. విశాఖ‌ప‌ట్నం నుంచి రాయ‌గ‌డ‌కు వెళ్తున్న ప్యాసెంజ‌ర్ రైలు సిగ్న‌ల్ కోసం ఎదురుచూస్తున్న స‌మ‌యంలో అదే ప‌ట్టాల‌పైకి ప‌లాస రైలు వేగంగా వ‌చ్చి ఢీకొట్టింది. దాంతో ప్యాసెంజ‌ర్ రైలు ప‌క్క‌నే వెళ్తున్న గూడ్స్ రైలు మీద‌కి దూసుకెళ్లింది. ప్ర‌స్తుతానికి స‌హాయ‌క చ‌ర్య‌లు జ‌రుగుతున్నాయి. రైలు బోగీలు నుజ్జునుజ్జ‌య్యాయి. దాంతో మృతుల సంఖ్య 50కి పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ కాసేప‌ట్లో విజ‌య‌న‌గరానికి చేరుకుని ప‌రిస్థితిని ప‌రిశీలించ‌నున్నారు.