EXCLUSIVE: మేన‌మామ‌నే గెంటేసారా?

EXCLUSIVE: మేఘా సంస్థ‌ల అధినేత పిపి రెడ్డిని (pp reddy) ఆయన మేన‌ల్లుడు కృష్ణారెడ్డి (pv krishna reddy) వెన్నుపోటు పొడిచి బ‌య‌టికి గెంటేసాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. పిపి రెడ్డి స్థాపించిన మేఘా సంస్థ‌ల‌ను త‌న గుప్పిట్లోకి తీసుకుని మేన‌మామ‌ను గెంటేసార‌ని.. ఆయ‌నకు చిల్లి గ‌వ్వ కూడా ఇవ్వ‌లేద‌ని టాక్.  కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌లో కృష్ణారెడ్డి ఏకంగా రూ.48 వేల కోట్లు నొక్కేసిన‌ట్లు కాగ్ రిపోర్ట్ చెప్తోంది. త‌న‌కు జ‌రిగిన మోసాన్ని పిపి రెడ్డి స‌హించ‌లేక‌పోయారు. అక్ర‌మాల‌పై ఫిర్యాదు చేస్తాన‌ని హెచ్చ‌రించ‌డంతో కృష్ణారెడ్డి వెన‌క్కి త‌గ్గార‌ట‌. నష్ట‌ప‌రిహారంగా రూ.35 కోట్లు అడ‌గ్గా.. ఇందుకు కృష్ణారెడ్డి ఇవ్వ‌డానికి ఒప్పుకోలేదు. అంత ఇచ్చుకోలేన‌ని కావాలంటే రూ.14 కోట్లు ఇస్తాన‌ని అన్నార‌ట‌. ఇలా ఒక్కొక్క‌టిగా మేఘా భాగోతాలు బ‌య‌టికి వ‌స్తున్నాయి.