Modi తెలంగాణ పర్యటన..BJP నాయకుల కొట్లాట‌

Hyderabad: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (modi) తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు ముందే BJP నాయ‌కులు కొట్లాడుకున్నారు. జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సమక్షంలో BJP ఆఫీస్ మీద దాడి చేసారు. దాంతో నర్సంపేట పట్టణంలో పార్టీ రెండుగా చీలింది. పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వడం లేదనే కారణంతో నర్సంపేట BJP నేత రాణా ప్రతాప్ రెడ్డి అనుచరులు రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి పార్టీ ఆఫీసును ధ్వంసం చేశారు. మోదీ (modi) రేప‌టి నుంచి తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ పర్యటనలో భాగంగా వరంగల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పీఎం శంకుస్థాపన చేయనున్నారు.