Chandrababu: సెంట్ర‌ల్ జైలుకు 12 మంది అధికారుల బృందం

TDP అధినేత చంద్ర‌బాబు నాయుడును (chandrababu) AP CID రెండు రోజుల పాటు విచారించ‌నుంది. ఈ నేప‌థ్యంలో 12 మంది అధికారుల‌తో కూడిన బృందం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు చేరుకుంది. CID DSP ధ‌నుంజ‌యుడు చంద్ర‌బాబును విచారించ‌నున్నారు. ఈ మేర‌కు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు వ‌ద్ద రెండు అంచెల భారీ భ‌ద్ర‌తను ఏర్పాటుచేసారు. చంద్ర‌బాబు నాయుడు త‌ర‌ఫున ఇద్ద‌రు లాయ‌ర్ల‌కు అనుమ‌తి ఇచ్చారు. విచార‌ణ‌ను లైవ్ రికార్డింగ్ చేస్తారు.