RK Roja: CID నుంచి రోజాకు పిలుపు?

cid first notice to roja in adudham andhra scam

RK Roja: వైఎస్సార్ కాంగ్రెస్ నేత ఆర్కే రోజాకు త్వ‌ర‌లో సీఐడి నుంచి పిలుపు రాబోతున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఆడుదాం ఆంధ్ర కార్య‌క్ర‌మంలో భాగంగా రోజా రూ.100 కోట్లు దోచుకున్నార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆడుదాం ఆంధ్ర కార్య‌క్ర‌మానికి విడుద‌లైన నిధుల్లో నుంచి ఒక్క రూపాయి కూడా ఆ కార్య‌క్ర‌మానికి ఖ‌ర్చు పెట్ట‌లేద‌ట‌.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రికెట్ అసోసియేష‌న్, స్పోర్ట్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కానీ క్రీడా శాఖ‌లో కానీ ఎక్క‌డా కూడా ఆ నిధుల‌ను వాడ‌లేద‌ట‌. ఈ రూ.100 కోట్ల కుంభ‌కోణంలో మాజీ ఛైర్మ‌న్ బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి, ఇత‌ర అధికారులు కూడా భాగ‌మే అనే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆల్రెడీ సీఐడికి కేసు వెళ్లింది కాబ‌ట్టి.. స్పోర్ట్స్ అసోసియేష‌న్ కార్యాల‌యంపై రైడ్లు చేసి కీల‌క‌మైన ప‌త్రాలు కూడా స్వాధీనం చేసుకోనున్నారు. అతి త్వ‌ర‌లో సీఐడి నుంచి మొద‌టి నోటీసు రోజాకే వెళ్ల‌నుంద‌ని తెలుస్తోంది.